YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. రూ.2.2 కోట్ల సొత్తు స్వాధీనం

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. రూ.2.2 కోట్ల సొత్తు స్వాధీనం

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. రూ.2.2 కోట్ల సొత్తు స్వాధీనం
హైదరాబాద్
నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. సాంకేతికత ఉపయోగించుకొని బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న బుకీలను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు. ‘‘పక్కా సమాచారంతో మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్దేవ్పల్లితో పాటు ఏడు చోట్ల దాడులు నిర్వహించాం. 23 మంది బుకీలను అరెస్టు చేయడంతో పాటు రూ.93 లక్షలు సీజ్ చేశాం. మొత్తం రూ.2.2 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నాం. గూగుల్లో ఉన్న మొబైల్ యాప్తో ఈ ముఠా బెట్టింట్కు పాల్పడుతోంది.
బెట్టింగ్ను నాలుగు లేయర్స్లో నిర్వహిస్తున్నారు. మెయిన్ బుకీకి అనుసంధానంగా మరో ముగ్గురు పని చేస్తారు. మొబైల్ యాప్స్ నుంచి సమాచారం తీసుకుని బెట్టింగ్ జరుపుతున్నారు. ముంబై, గోవా, దుబాయ్లలో వీరికి నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించాం. విజయవాడకు చెందిన మహా అనే వ్యక్తి మెయిన్ బుకీగా ఉన్నాడు. బెట్టింగ్ నిర్వహిస్తున్న యాప్స్ను తొలగించాలని గూగుల్కు లేఖ రాస్తాం. బెట్టింగ్ నిర్వహిస్తూ చాలా మంది అప్పుల పాలవుతున్న నేపథ్యంలో పిల్లల ఫోన్లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి’’ అని సీపీ సూచించారు.

Related Posts