YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పేపర్‌ రోల్‌ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం

పేపర్‌ రోల్‌ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ అక్టోబర్ 11
దేశ రాజధాని ఢిల్లీలోని హర్ష్‌ విహార్‌లో ఉన్న పేపర్‌ రోల్‌ గోదామ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది క్రమంగా అవి గోదామ్‌ మొత్తానికి విస్తరించాయి. మంటల ధాటికి మూడంతస్తుల గోదామ్‌ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 16 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.గోదామ్‌లో పనిచేస్తున్న కార్మికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరూ గాయపడలేదని చెప్పారు. సోమవారం తెల్లవారుజామున 3.36 గంటలకు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అతుల్‌ కుమార్‌ తెలిపారు. మంటలను అదుపు చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టిందని వెల్లడించారు.

Related Posts