YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

సింగరేణికి ఆర్ధిక కష్టాలు

సింగరేణికి ఆర్ధిక కష్టాలు

సింగరేణి సంస్థకు ఆర్థిక కష్టాలు వచ్చాయి. బొగ్గు తవ్వే కార్మికులకు దీపావళి బోనస్‌ను చెల్లించడానికి డబ్బుల్లేక ఆ సంస్థ లోన్లు ఇచ్చే వారి కోసం వెతుకుతోంది. రూ.500 కోట్లు కావాలని నోటిఫికేషన్ ఇచ్చింది.. ఎవరు తక్కువ వడ్డీకిస్తారో తెలుపుతూ టెండర్లు వేయాలని బ్యాంకులను ఆహ్వానిస్తూ అందులో పేర్కొంది. తక్కువ వడ్డీ కోట్‌ చేసిన బ్యాంకు నుంచే రుణం తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. టెండర్లు వేసేందుకు ఈనెల 13 వరకు గడువు పెట్టింది.నిత్యం 1.40 లక్షల టన్నుల దాకా బొగ్గును తవ్వి దేశంలోని పలు విద్యుత్ కేంద్రాలు, ఇతర రాష్ట్రాలకు సింగరేణి అమ్ముతోంది. బొగ్గు కొన్న విద్యుత్కేంద్రాలు సొమ్ము చెల్లించకపోవడంతో సంస్థ వద్ద నిధుల కొరత ఉంది. లాభాల బోనస్‌ కింద కంపెనీ రూ.79.07 కోట్లను కార్మికులకు ఈనెల 8న చెల్లించింది. గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆధారంగా దీపావళి బోనస్‌ను నవంబర్ 1న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు తక్షణం రూ.300 కోట్లు కావాలి. ఈ బోనస్‌ కింద ప్రతి కార్మికుడికీ సగటున రూ.72,500 అందుతాయి. ఇవేకాకుండా పండగ అడ్వాన్స్‌గా ప్రతి కార్మికుడికీ రూ.25 వేలు ఇస్తామని ప్రకటించింది. వీటికి మరో రూ.70 కోట్లు కావాలి.. ఇవన్నీ కలిపితే రూ.449 కోట్లు.. ఇతర ఖర్చులకు మరో రూ.500 కోట్ల లోన్ కోసం అత్యవసరంగా టెండర్లు ఆహ్వానించింది.

Related Posts