YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేంద్ర ప్ర‌భుత్వ అహంకారాన్ని ఓడించిన‌ట్లు రైతుల స‌త్యాగ్ర‌హం.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

కేంద్ర ప్ర‌భుత్వ అహంకారాన్ని ఓడించిన‌ట్లు రైతుల స‌త్యాగ్ర‌హం..  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ నవంబర్ 19
కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రైతులు చేప‌ట్టిన స‌త్యాగ్ర‌హం.. కేంద్ర ప్ర‌భుత్వ అహంకారాన్ని ఓడించిన‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు. ఏడాది కాలం నుంచి దేశ‌వ్యాప్తంగా రైతులు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆ ఆందోళ‌న‌ల్లో వంద‌ల సంఖ్య‌లో అన్న‌దాత‌లు ప్రాణాలు కోల్పోయారు. రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు మోదీ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌.. రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు. దేశ రైతులు త‌మ స‌త్యాగ్ర‌హ దీక్ష‌తో.. కేంద్ర స‌ర్కార్ అహంకారాన్ని త‌ల‌దించుకునేలా చేశార‌న్నారు. ఇది అన్యాయంపై విజ‌య‌మ‌ని, ఈ సంద‌ర్భ‌రంగా రైతుల‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. జై హింద్‌, జై కిసాన్ అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. రైతు చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా మాట్లాడిన పాత వీడియోను కూడా త‌న ట్విట్ట‌ర్‌లో రాహుల్ షేర్‌ చేశారు. రైతు చ‌ట్టాల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకునేలా చేస్తామ‌ని, త‌న మాటాల‌ను గుర్తుపెట్టుకోవాలంటూ చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియోను రాహుల్ పోస్టు చేశారు.

Related Posts