YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

ఒమిక్రాన్ భయం సరిహద్దుల మూసివేత

ఒమిక్రాన్ భయం సరిహద్దుల మూసివేత

న్యూఢిల్లీ, నవంబర్ 29,
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరోసారి ప్రపంచ దేశాలను భయపెడుతోంది. గత వేరియంట్ల కంటే అత్యంత వేగంగా వ్యాప్తిచెందడంతో పాటు వ్యాధినిరోధకతను కూడా ఏమార్చే లక్షణాలు ఉండటంతో నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించడంతో మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇజ్రాయేల్‌లో నిర్ధారణ కావడంతో ఆ దేశ ప్రధాని శనివారం అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. సాయంత్రం తర్వాత నుంచి సరిహద్దులను మూసివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి సరిహద్దులను మూసేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ‘‘ప్రత్యేక కమిటీ ఆమోదించిన కొన్ని కేసులకు తప్ప విదేశీయులకు దేశంలోకి ప్రవేశం నిషేధించాం.. ఇది ఆదివారం సాయంత్రం నుంచి అమల్లోకి వస్తుంది’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయేల్ పౌరులైతే పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, కోవిడ్ పూర్తిస్థాయి టీకా తీసుకుంటే మూడు రోజులు, వేసుకోకుంటే ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కాగా, కరోనా వ్యాప్తితో గతేడాది నుంచి సరిహద్దులను మూసివేసిన ఇజ్రాయేల్.. నాలుగు వారాల కిందటే విదేశీ పర్యాటకుల కోసం తెరిచింది.
ఇజ్రాయేల్ కోవిడ్-19ను పర్యవేక్షించే టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ మార్గదర్శకాలను నిర్ణయించగా..ఉదయం ఆ దేశ క్యాబినెట్ ఆమోదించింది. కాగా, ఇజ్రాయేల్‌లో యూదుల ఎనిమిది రోజుల పండుగ హనుక్క ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేసిన దేశాల్లో తొలి స్థానంలో ఇజ్రాయేల్.. కొత్త వేరియంట్ కేసును గుర్తించిన తర్వాత జనాభాను రక్షించడానికి ఇప్పటికే అనేక అత్యవసర చర్యలను చేపట్టింది.

Related Posts