YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

సెకండ్ టెస్ట్ కు వాన గండం

సెకండ్ టెస్ట్ కు వాన గండం

ముంబై డిసెంబర్ 2
భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టు సాఫీగా జరిగే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే కాన్పూర్‌లో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ హైడ్రామా నడుమ చివరి రోజు డ్రాగా ముగియగా.. రెండో టెస్టు మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. రెండు టెస్టుల ఈ సిరీస్‌ని 1-0తో చేజిక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. తొలి టెస్టుకి దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రెండో టెస్టుతో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.వాంఖడే స్టేడియం పరిసరాల్లో బుధవారం వర్షం పడగా.. భారత్, న్యూజిలాండ్ జట్లు తమ ప్రాక్టీస్‌ని రద్దు చేసుకుని హోటల్‌కి వెళ్లిపోయాయి. గురువారం, శుక్రవారం కూడా అక్కడ వర్షం పడే సూచనలు కనిపిస్తుండగా.. ఈరోజుకి ముంబయిలోని మరో క్రికెట్ స్టేడియం బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ ఇండోర్‌లో ప్రాక్టీస్ చేయడానికి సౌకర్యాలు ఉన్నాయి. వాంఖడే పిచ్‌ తొలుత ఫాస్ట్ బౌలర్లకి అనుకూలించనుండగా.. ఆ తర్వాత స్పిన్నర్లకి సహకరించనుంది.కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. రెండో టెస్టుకి స్టేడియంలోకి కేవలం 25% మంది ప్రేక్షకుల్ని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. స్టేడియం సీటింగ్ సామర్థ్యం 30,000కాగా.. ముంబయి క్రికెట్ అసోషియేషన్ 50% ప్రేక్షకుల్ని అనుమతించాలని తొలుత నిర్ణయించింది. కానీ.. మహారాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు 25%కి కుదించింది

Related Posts