YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిలో బాలయ్య

ఇంద్రకీలాద్రిలో బాలయ్య

విజయవాడ
అఖండ సినిమా విజయంతో హీరో నందమూరి బాలకృష్ణ పుల్ జోష్ లో ఉన్నారు. సినిమా విజయంవంతం కావడంతో వరుసగా పలు ఆలయాల దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించు కున్న బాలయ్య.. తాజాగా ఇంద్రకీలా ద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రమేష్ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి బాలకృష్ణ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. బాలయ్యకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు.సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు. దర్శకులు ముందుకొచ్చి కథ నచ్చితే మల్టీస్టారర్ చేస్తానని ప్రకటించారు.

Related Posts