YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రమణ ప్రోటోకాల్...హడావిడి..చర్చ

రమణ ప్రోటోకాల్...హడావిడి..చర్చ

విజయవాడ, డిసెంబర్ 27,
వైసీపీ అధినేత జగన్ రెడ్డి మరోసారి యూటర్న్ తీసుకున్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే ఆయన మనస్థత్వాన్ని మరోసారి సీజేఐ ఎన్వీ రమణ సాక్షిగా బయట పెట్టుకున్నారు. గతంలో ఎంతో మందిపై కత్తి దూసి.. అనవసరంగా దాడులు చేసి.. శత్రువులకే శత్రువుగా చూసి.. చివరికి తెల్లజెండా ఎగరేసినట్లుగానే ఇప్పుడు సీజేఐ ఎన్వీ రమణ విషయంలోనూ జగన్ మారిపోయారు. అనూహ్యంగా .. సీజేఐగా ఆయన ఎన్నికయిన ఎనిమిది నెలల తర్వాత ఎక్కడా లేని వినయాన్ని తెచ్చుకుని గౌరవ మర్యాదలు చూపిస్తున్నారు సీజేఐ ఎన్వీ రమణ విషయలో ఏపీ సీఎం జగన్ ప్రదర్శిస్తున్న అతి వినయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో జరిగిన పరిణామాలు చూస్తే ఇది సాధారణం కాదు.. అసాధారణం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఓ ఏడాది వెనక్కి వెళ్తే కాబోయే సీజేఐ ఎన్వీ రమణపై తీవ్రమైన అభియోగాలు చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి చీఫ్ జస్టిస్ బోబ్డేకు లేఖ రాశారు. అజేయకల్లాం అనే సలహాదారుతో ఆ లేఖను తానే స్వయంగా బయట పెట్టించారు. జస్టిస్ ఎన్వీ రమణపై దేశవ్యాప్తంగా భారీగా ఖర్చు పెట్టి.. పీఆర్‌ సంస్థను నియమించుకుని తప్పుడు ప్రచారం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ ప్రభుత్వం అలా టార్గెట్ చేసింది మొదటి సారి కాదు అంతకు ముందు సారి మాజీ అడ్వేకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై రాజధాని భూముల కేసులు పెట్టారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పెట్టిన ఆ ఎఫ్‌ఐఆర్‌లో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. అంతకు ముందెప్పుడో.. తన తాబేదార్లు అయిన వ్యక్తులతో జస్టిస్ ఎన్వీ రమణపై చదువుకునేటప్పుడు ఓ కేసు ఉందని పిటిషన్లు వేయించి భంగపడ్డారు. జస్టిస్ ఎన్వీ రమణ టార్గెట్‌గా జగన్ సుదీర్ఘ కాలంగా చేస్తున్న తప్పుడు ప్రచారం.. ఆరోపణలను నిన్నటి పరిణామాలతో జగన్ తప్పు అని అంగీకరించినట్లే అయింది. సీజేఐకి ఎన్వీ రమణ ఎన్నికయిన తర్వాత తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే తెలంగాణ సర్కార్ మాత్రం గొప్ప ఆహ్వానం పలికింది. కానీ ఇప్పుడు మాత్రం సీజేఐ ఎన్వీ రమణ స్వగ్రామంలో పర్యటించేందుకు మూడు రోజుల కార్యక్రమాలు ఖరారు కాగానే ప్రభుత్వం అత్యంత ప్రయారిటీగా తీసుకుంది. ఎక్కడిక్కడ అత్యంత వినయవిధేయలతో మర్యాదలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సీజేఐని శాలువా కప్పి గౌరవించారు. ప్రభుత్వం తరపున అధికారికంగా తేనీటి విందు ఏర్పాటు ఇచ్చారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు..? ప్రోటోకాల్ అధికార మర్యాదల గురించి ఇప్పుడే తెలిసిందా ? ఓ వ్యవస్థపై ఎన్ని రకాలుగా దాడులు చేయాలో అన్నీ చేసేసిన తర్వాత కూడా ఇంకా ఏమీ సాధించలేని పరిస్థితుల్లో కాళ్ల బేరానికి వెళ్లారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంత కాలం ఆయన చేసిన దాడులను న్యాయవ్యవస్థ అంత తేలికగా మర్చిపోతుందా అన్దే ఇక్కడ అసలు పాయింట్. పైగా జగన్మోహన్ రెడ్డికి తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. న్యాయమూర్తులను కాకా పట్టడం… విందులు ఇవ్వడం ద్వారా తీర్పులు మారవు. చట్టాలు.. రాజ్యాంగాలకు లోబడే తీర్పులు ఉంటాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు న్యాయవ్యవస్థపై అమితమైన గౌరవం ప్రదర్శించడం అత్యవసరం అని ఆయన సలహాదారులుగా చెప్పినట్లుగా ఉంది. అందుకే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సీజేఐపై అతి వినయం ప్రదర్శించారు. సీజేఐ ప్రభుత్వమే అధికార మర్యాదలు ఇస్తాననన్నప్పుడు తిరస్కరించలేరు. అలా తిరస్కరిస్తే సీఎంపై ఆయన వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం చేస్తారు. అందుకే ఆయన కూడా ప్రోటోకాల్ ప్రకారం.. ఎక్కడా వివాదాస్పదం కాకుండా చూసుకున్నారు. దీన్ని బట్టి జగన్ తాను చేసిన నేరాలు.. ఘోరాల నుంచి రక్షణ లభిస్తుందని అనుకుంటే.. అది భారతీయ వ్యవస్థలను కించ పరిచినట్లే..!

Related Posts