
బద్వేలు
ఏ రాష్ట్రంలోనైనా ఏ జిల్లాలోనైనా చట్టం ముందు అందరూ సమానమే సినిమా నటులైన మాజీ ముఖ్యమంత్రి అయిన ఒకటే. మాజీ సీఎం జగన్ కారు ఢీకొనడంతో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఆ మేర పోలీసులు కేసు నమోదు చేయడంతో సరిపెట్టుకోకుండా తక్షణం జగన్ అరెస్ట్ చేయాలి టిడిపి రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం హరి టవర్స్ నందు విలేకరులతో మాట్లాడారు సినిమా రిలీజ్ సందర్భంగా పేక్షకుల మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ మృతి చెందడంతో హైదరాబాద్లో హైదరాబాద్ పోలీసులు ఆ చిత్రం హీరో అల్లు అర్జున్ అర్జున్ ను అరెస్ట్ చేసి జైలు కు పంపిన సంగతి ప్రజలు పోలీసులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మన రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈనెల 18న బలప్రదర్శన కోసం జన సమీకరణ చేసి తన కారు తో సింగయ్య అనే వ్యక్తి మృతి కి కారకులయ్యారు అన్నారు. రాష్ట్ర పోలీసులు నింపాదిగా ఐదు రోజుల తర్వాత కేసు నమోదు చేశారన్నారు అయితే మృతి చెందిన సింగయ్య దళితులు కావడంతో ఎస్సీ ఎస్టీ కూడా సెక్షన్లు కూడా నమోదు చేయాలని కోరారు. కేసు నమోదు తో చేతులు దులుపుపోకుండా వెంటనే జగన్ను అరెస్టు చేసి జైలు పంపాలని డిమాండ్ చేశారు.కారు కింద కుక్కో కోడో పడినమనం తొంగి చూస్తామని అలాంటిది జగన్ తన కారు కింద ఓ వ్యక్తిపడిన వెళ్లిపోయాడు అంటే ఆయన రాక్షస వ్యక్తిత్వం బయటపడిందన్నారు. టిడిపి నాయకులు కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు రఫ్ఫా రఫ్ఫా నరుకుతామని ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తే జగన్ సమర్థించడం క్షమించడానికి నేరం అన్నారు ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండే అర్హత లేదని జీవితాంతం జైల్లో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయమై ప్రజాసంఘాలు కూడా స్పందించాలని కోరారు రాష్ట్ర పోలీసులు మీనమేషాలు లెక్కించకుండా జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించి సమాజంలో ఇలాంటి వ్యక్తుల ద్వారా శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు గోపిశెట్టి నాగరాజు గంధం ప్రసాద్ వెంకట సాయి లకిడి విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.