
మేడ్చల్
ఫోన్ టాపరింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఫోన్ టాపింగ్ కేసు విచారణపై సోమవారం జూబ్లీహిల్స్ ఏసిపి కార్యాలయానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎలక్షన్లో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో ఏనుముల కొండల్ రెడ్డి నేను హరివర్ధన్ రెడ్డిని ఇన్చార్జిగా ఉన్న సమయంలో మా ఫోన్ టాపింగ్ చేసి రేవంత్ రెడ్డి ని కామారెడ్డిలో ఓడించారని తెలిపారు. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి, తన ఫోన్ ట్యాప్ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి.సుమారు 600 మందికి పైగా సినిమా వాళ్లు, లీడర్లువి పైగా ఫోన్లు టాంపరింగ్ చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.