YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బాలికపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం

బాలికపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం

నెల్లూరు
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఒక హెడ్ కానిస్టేబుల్ తన ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా  బయటకొచ్చింది. నెల్లూరు జిల్లా  చిట్టమూరు పోలీస్ స్టేషన్లో సుధాకర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఒక కుటుంబ సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇస్తానని తండ్రితో పాటు బాలికను తన ఇంటికి పిలిపించుకున్నాడు.  బాలిక తండ్రిని సమీపంలోని ఓ షాపుకి పంపించి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్. బాలిక ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో బిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారించారు. బాలికపై అత్యాచారయత్నం చేసినట్లు తేలడంతో ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

Related Posts