YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

పుత్తడి ధరకు రెక్కలొచ్చాయి...

పుత్తడి ధరకు రెక్కలొచ్చాయి...

రెండేళ్ల గరిష్ట స్థాయికి బంగారం...

 దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దాదాపు రెండేళ్ల గరిష్ట స్థాయిని ఈరోజు తాకాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 156 పెరిగి ప్రస్తుతం రూ. 30,405కు చేరుకుంది. అమెరికన్ డాలర్ విలువ తగ్గడంతో, పుత్తడి ధరకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ ధర 1360.60 డాలర్లకు చేరుకుంది. 2016 ఆగస్టు నాటి ధర 1361.87 డాలర్లకు చేరువైంది. ఈ నేపథ్యంలో రాయిటర్స్ విశ్లేషకుడు వాంగ్ టావో మాట్లాడుతూ, బంగారం ధరలు మరింత పుంజుకుంటాయని చెప్పారు.

Related Posts