YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశ ప్రజస్వామ్యాన్ని బలోపేతం చేయాలి..

దేశ ప్రజస్వామ్యాన్ని బలోపేతం చేయాలి..

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడి పిలుపు

 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడి పిలుపునిచ్చారు. తద్వారా దేశ ప్రజస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడి తన సందేశాన్ని ఈ రోజు విడుదల చేశారు. ఎన్నికల సంఘం వార్షికోత్సవం సందర్భంగా అభినందనలు కూడా తెలియజేశారు. ''అర్హులైన ఓటర్లందరినీ, ముఖ్యంగా యువతను నేను కోరేదేమంటే వారు తమ పేర్లను నమోదు చేసుకుని ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి'' అంటూ మోడి ట్వీట్ చేశారు. ఓటుకు ఉన్న శక్తి అపారమన్నారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడగా, ఏటా ఈ రోజును ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు.

 

Related Posts