YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ తో చిరంజీవి భేటీ

సీఎం జగన్ తో చిరంజీవి భేటీ

అమరావతి
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి గురువారం భేటీ అయ్యారు. సీఎంతో లంచ్ మీటింగ్ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా సినిమా టికెట్ల వివాదానికి సంబంధించిన అంశంపైనే చర్చలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ ఎయిర్ పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు.  తాను సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చిరంజీవి అన్నారు. టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా నన్ను ఆహ్వానించారు. సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చింది. అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాను. రెండువైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారు. సినీ పరిశ్రమ సాధక బాధలను తెలుసుకున్నాను అని సీఎం చెప్పారు. ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని చెప్పారు. సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చా. త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు. ఐదో షో ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు. సినిమా పరిశ్రమలో ని వ్యక్తులు ఎవరూ లేని పోనీ కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కమిటీ సమావేశానికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తామని అన్నారు.

Related Posts