YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కేరళను కమ్మేస్తున్న ఒమిక్రాన్

 కేరళను కమ్మేస్తున్న ఒమిక్రాన్

రువనంతపురం, జనవరి 21,
వేరియంట్ వ్యాప్తితో దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గతవారం రోజుల నుంచి రోజువారీ కేసులు 2 లక్షలు దాటేస్తుండగా.. మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు, కరోనాతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, సెకెండ్ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన కేరళలో మరోసారి వైరస్ ఉద్ధృతమవుతోంది. ఆ రాష్ట్రంలో రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరగడంతో పినరయి విజయన్ సర్కారు అప్రమత్తమయ్యింది.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందినా.. ఇన్‌ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, దీనికి భిన్నంగా కేరళలో ఆస్పత్రుల్లో చేరే బాధితుల సంఖ్యలో పెరుగుదల నమోదయ్యింది. నిన్న ఒక్క రోజే ఐసీయూ పడకలు 15 శాతం, ఆక్సిజన్ పడకలు 20 శాతం మేర డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో వృద్ధులు, అనారోగ్య సమస్యల ఉన్నవారికి ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తొలి రెండు వేవ్‌ల్లో సురక్షితంగా ఉన్నవారు ఇప్పుడు ముప్పును ఎదుర్కొంటున్నారని అన్నారు.‘‘వ్యాప్తి ఎక్కువగా ఉంటే తేలికపాటి వేరియంట్ కూడా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి.. హాస్పిటల్ అడ్మిషన్లు,ఐసీయూ, ఆక్సిజన్ కోసం డిమాండ్ ఒక రోజులో పెరిగింది’’అని తిరువనంతపురం మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టీఎస్ అనిష్ పేర్కొన్నారు.ఇదే సమయంలో కేరళ సెక్రటేరియట్‌ కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. సీఎంఓలోని పొలిటికల్ సెక్రటరీ సహా ఆరుగురు ఉద్యోగులు, దేవాదాయ, ఆరోగ్య శాఖల కార్యాలయాల్లోని సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు. దాదాపు 80 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. ఇప్పటికే కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.

Related Posts