YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

ఫివర్ సర్వేలో పాల్గోన్న మంత్రి హరీష్ రావు

ఫివర్ సర్వేలో పాల్గోన్న మంత్రి హరీష్ రావు

సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం మంత్రి హరీష్ రావు పర్యటించారు. 37 వవార్డులో కొనసాగుతున్న ఫివర్ సర్వేను అయన పరిశీలించారు. మంత్రి మాట్లాడుతున్నారు. కరోన వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా వైద్య ఆరోగ్య కార్యకర్తలు గుంపులు గుంపు గా వెళ్లకుండా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు. నిన్న ఒక్క రోజే 12 లక్షల మందిని పరీక్షలు చేశారని అన్నారు. హోమ్ కిట్ ద్వారా కరోనా లక్షనాలు పోతున్నాయి. ప్రతి రోజు వారీ ఆరోగ్య శాఖ పరీక్ష నిర్వహిస్తారు. అన్ని రకాల వైద్యం చేస్తారు. 5 నుండి 8 వారాలు ఈ సర్వే చేయిస్తారు. మందుల ద్వారా తగ్గుతుంది అని ఆరోగ్య శాఖ చెప్పి నప్పటికి ప్రతి రోజు సర్వే చేస్తున్నామని మంత్రి అన్నారు. నీటి ఆయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వే  పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  కరోనా కట్టడిలో నాయకులు, అధికారులు కలిసి పని చేయాలి.  పిల్లలు కోసం ప్రత్యేక, పెద్దల కోసం ప్రత్యేక వార్డ్ లాంఛ్ ఏర్పాటు చేశారు.కోటి హోమ్ కిట్ లని ప్రభుత్వం సిద్ధం చేసింది.  ప్రతి గ్రామంలో లోకి కిట్ లు రెడి గా ఉంది. ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తుంది. గ్రామ ప్రజా రక్షణ కోసం ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలి.  370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడి గా ఉంచాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా డాక్టర్ కాలీ లేకుండా అన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  ప్రజలు ఎవరు నిర్లక్ష్యంగా ఉండకండి. ఆశా కార్యకర్తలు సమాచారం అందించే వారి సేవలు వినియోగించుకోవాలి.  ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్  వేసుకోవాలి.  దీని వల్ల ప్రాణ ముప్పు ఉండదు.  సర్వే లో పాల్గొన్న ప్రతి అధికారులందరికి కృతజ్ఞతలని మంత్రి అన్నారు.

Related Posts