YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్రతి నలుగురిలో ఒకరికి...

ప్రతి నలుగురిలో ఒకరికి...

హైదరాబాద్, జనవరి 24,
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు బయటపడుతున్నాయి.. చాలా మంది ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటోంది.. గత నెలరోజులుగా ప్రతి ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య సర్వసాధారణమైంది..రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులుగా ఫీవర్ సర్వే జరిగింది.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో దీన్ని మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తామని మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకు 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం తదితర లక్షణాలున్న వారు 1,28,079 మంది ఉండగా.. వీరిలో 1,27,372 మందికి కిట్లు పంపిణీ చేశారు. అయితే చాలా మందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోకుండా స్థానిక వైద్యుల సహకారంతో మందులు వాడుతున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లో కరోనా లక్షణాల తీవ్రత తగ్గుతుండటంతో ప్రజలు కూడా తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో స్థానికంగా పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్‌, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్‌ బృందంగా ఏర్పడి రెండ్రోజులుగా రోజుకు 100 ఇళ్లను సర్వే చేస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలుంటే.. అక్కడే పరీక్షించి కిట్లు పంపిణీ చేస్తున్నారు..అయితే చాలాచోట్ల జ్వరం, జలుబు తదితర లక్షణాలున్నా భయంతో వైద్య సిబ్బందికి లేవని చెబుతున్నారు. ఏదేమైనా తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఇంట్లో ఒకరికి ఏదో ఒక లక్షణం కనిపిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సర్వేలోని సిబ్బంది సూచిస్తున్నారు. అయినా కూడా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు.

Related Posts