YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

పబ్లిక్ పరీక్షలకు ఛాయిస్ రెట్టింపు

పబ్లిక్ పరీక్షలకు ఛాయిస్ రెట్టింపు

హైదరాబాద్, జనవరి 24,
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్ పరీక్షలతో పాటు 8, 9, 10వ ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి ప్రకటన చేసింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం విద్యార్థులకు ఊరట కలిగించనుంది. ఈసారి కూడా సిలబస్ తగ్గించడంతో పాటు చాయిస్ ప్రశ్నలు కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు.ఇంటర్‌ పరీక్షల ప్రశ్నపత్రాల్లో గతేడాది కంటే మరికొంత చాయిస్‌ పెంచాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం మూడు సెక్షన్లలో గత విద్యా సంవత్సరమే రెండు సెక్షన్లలో భారీగా చాయిస్‌ పెంచిన సంగతి తెలిసిందే. వచ్చే వార్షిక పరీక్షలకు కూడా మరోసారి పెంచనున్నారు. గతేడాది వరకు సైన్స్‌ గ్రూపుల్లో 2 మార్కుల ప్రశ్నల్లో చాయిస్‌ ఇవ్వలేదు. ఈసారి ఆ సెక్షన్‌కూ వర్తింపజేయనున్నారు. ఇప్పటివరకు 10కి 10 జవాబులు రాయాల్సి ఉండగా వాటిని 15కు పెంచి 10కి జవాబులు రాసేలా చాయిస్‌ ఇవ్వనున్నారు.ఇక ఆర్ట్స్‌ గ్రూపులో గతంలో 10 మార్కుల ప్రశ్నలు 6 ఇస్తే 3 రాయాలి. దాన్ని ఏడుకు పెంచుతారు. 5 మార్కుల ప్రశ్నలు 16కు 8 రాయాల్సి ఉంటుంది. వాటిని 18కి పెంచుతారు.. ఇటు మే 2వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు జరపాలని బోర్డు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.మరోవైపు సోమవారం జనవరి 24 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా 8, 9, 10 తరగతులకు కచ్చితంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు తమ విధులకు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ 50 శాతం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది విధులకు హాజరు కావాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

Related Posts