YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

అమరావతి
విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్పో లో ఏపీ పెవిలియన్ వుంటుందని  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దుబయ్ ఎక్స్ పో -2022 సన్నద్ధత ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. దుబయ్ ఎక్స్ పో సన్నద్ధత ఏర్పాట్ల పట్ల పరిశ్రమల శాఖ కృషిని అయన అభినందించారు.ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ప్రత్యేకమని చాటే విధంగా ఇలాగే ఐక్యతతో ముందుకు సాగాలని మంత్రి మేకపాటి దిశానిర్దేశం చేసారు. ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య జరగనున్న ఎక్స్ పోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజరవుతోంది. ఫిబ్రవరి 8న మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం దుబాయ్ పయనం అవుతారు. ఈ సమీక్షకు  పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, జాయింట్ డైరెక్టర్లు ఇందిరా, వీఆర్ వీఆర్ నాయక్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, తదితరులు హజరయ్యారు.  

Related Posts