YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీ వలలో మహిళా విఆర్వో

ఏసీబీ వలలో మహిళా విఆర్వో

చిత్తూరు
మహిళా రైతు నుండి 3 వేలు లంచం తీసుకుంటున్న మాపాక్షి విఆర్వో నౌజీయాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. తిరుపతి ఏసిబి డి ఎస్ పి జనార్దన్ నాయుడు బృందం శుక్రవారం ఈ దాడులు చేసట్టారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు రూరల్ మండలం మాపాక్షి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన మూడు ఎకరాల భూమికి సంబంధించి 1 బి కావాలని మాపాక్షి విఆర్ఓ నౌజీయాను సంప్రదించింది. అందుకు గాను  మూడు వేల రూపాయలు లంచం ఇస్తేనే ఏర్పాటు చేస్తానని చెప్పడంతో , బాధితురాలు వెంటనే తిరుపతి లోని ఏసీబీ అధికారులను సంప్రదించింది. . దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం భారతి తన పింఛను డబ్బుతో వి ఆర్ ఓ నౌజీయా కు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీని పైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడుల్లో సీఐ ఈశ్వర్, తమీమ్ అహ్మద్, వెంకట్ నాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ, మహిళా పోలీసు ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts