YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రేమదాస్ కధ ఇంతింత కాదయా..

ప్రేమదాస్ కధ ఇంతింత కాదయా..

విశాఖపట్టణం, ఫిబ్రవరి 7,
విశాఖపట్నం జిల్లాలో వెలుగుచూసిన కీచక పాస్టర్ అనిల్ అలియాస్ ప్రేమ్ దాస్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఆధ్యాత్మికత ముసుగులో మాయమాటలతో ఓ యువతిని ట్రాప్ చేసి లోబరుచుకున్నట్టు నిర్ధారించారు. వివరాల్లోకెళితే.. విజయవాడకు చెందిన అనిల్ కొన్నేళ్ల క్రితం విశాఖ జిల్లాకు వచ్చాడు. పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో ప్రేమ స్వరూపిని ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా సిద్ధం చేశాడు. అందులో దేవుడి పేరు చెప్పి ఉపదేశాలు మొదలుపెట్టి పాస్టర్ గా చెప్పుకుంటున్న ప్రేమ దాస్.. అందర్నీ ఎట్రాక్ట్ చేయడం ప్రారంభించాడు. చానల్లో సబ్ స్కైబ్  గా ఉన్నవారిని ఒక్కొక్కరిని మెల్లగా మాయమాటలతో తనవైపు ఆకర్షించాడు. దీంతోపాటు కొన్ని పుస్తకాలు ప్రచురించి.. సభలు సమావేశాలు కూడా పెట్టేవాడు. దేవుడి పేరుతో చందాలు కూడా వసూలు చేసేవాడు. తన మాటలకు ఎట్రాక్ట్ ఆయన కొంతమంది.. అతని దగ్గరకు వచ్చేసారు. దీంతో తన దగ్గరికి వచ్చిన వారిని మెల్లగా మాయమాటలతో ట్రాప్ చేయడం ప్రారంభించినట్టు నిర్ధారించారు పోలీసులు. ఇక కోదాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసేది. 2018 లో ఈ ప్రేమ దాసు రచించిన పుస్తకం చూసి ప్రేమ్ దాస్ కు కాల్ చేసిన పాపానికి ఆమెను ట్రాప్ చేయడం ప్రారంభించాడు. పాయకరావు పేటలో ఉన్న తన మినిస్ట్రీస్ కి వచ్చి దేవుడు సేవ చేయాలని మాటల్లో పెట్టి మాయ చేసాడు. అప్పటి నుంచి తన దగ్గరే ఉంచుకుని ఆమెను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఇదిలాఉంటే మరో మహిళతో కూడా ఈ పాస్టర్ సహజీవనం చేసేవాడని తేల్చారు పోలీసులు. యువతిని ట్రాప్ చేసే వ్యవహారంలో ఆమె కూడా పాస్టర్ అనిల్ కు సహకరించినట్లు గుర్తించారు. ఓవైపు రాజేశ్వరితో సహజీవనం చేస్తూనే.. మరోవైపు ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడు ఈ పాస్టర్. అంతేకాదు బూతు చిత్రాలు కూడా పంపించమని చెప్పేవాడు. తాను యువతిని శారీరకంగా, లైంగికంగా వేధించడంతో పాటు సహజీవనం చేస్తున్న మహిళ తమ్ముడుతో ఆమెకు బలవంతపు పెళ్లి కూడా చేశాడు. అంతేకాదు ఓసారి అబార్షన్ కూడా బలవంతంగా చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ టార్చర్ భరించలేకపోయిన యువతి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో పాస్టర్ పాపాల పుట్ట బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడిగా పాస్టర్ అనిల్ తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని కేసులో చేర్చారు మరోవైపు పాస్టర్ ఆధ్యాత్మికత ముసుగులో నడుపుతున్న ఆశ్రమంలో 27 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. పాస్టర్ మాయమాటల్లో పడి వీరు తమ కుటుంబాలకు దూరమయ్యారు. అయితే వీరందరినీ ఐసీడీఎస్ రెవెన్యూ అధికారులు కౌన్సెలింగ్ చేశారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించి.. కొంతమందిని తూర్పు గోదావరి జిల్లాకు వారి కుటుంబ సభ్యులు అప్పగించగా.. మిగిలిన వారిని విశాఖలో ఐసిడిఎస్ అధికారులు వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు.
18 మందికి విముక్తి
ప్రేమదాస చెరలో ఉన్న వారందరికీ విముక్తి కల్పించిన అధికారులు అతడి భవంతికి శనివారం తాళం వేశారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులు, నలుగురు యువకులు అతడి భవంతిలో బందీలుగా ఉన్నట్టు గుర్తించారు. తమ ఇళ్లకు పంపమని కోరిన 8 మందిని  ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య వారి స్వస్థలాలకు పంపించారు.14 మంది తాము భవనం ఖాళీ చేసే ప్రసక్తి లేదని, ఇక్కడే ఉంటామని మొండికేయడంతో  కౌన్సెలింగ్‌ ఇచ్చి శనివారం వారిని కూడా విశాఖ కేజీహెచ్‌లోని దిశ షెల్టర్‌ హోమ్‌కు తరలించారు. వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వధార్‌ హోమ్‌కు తరలిస్తామని, మరోసారి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు చెప్పారు. సంస్థ నిర్వాహకుడైన అనిల్‌కుమార్‌ అలియాస్‌ ప్రేమదాసు, అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నుంచి కొన్ని ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమదాస్‌కు సహకరించిన రాజేశ్వరి అలియాస్‌ లిల్లీ పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు.

Related Posts