YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రిసార్ట్ లో మత్తు పదార్ధాలు స్వాధీనం

రిసార్ట్ లో మత్తు పదార్ధాలు స్వాధీనం

విశాఖపట్నం
అచ్యుతాపురం మండలం కొండకర్ల అవా సమీపంలో ఎస్.ఐ. ఎస్ రిసార్ట్స్ లో మత్తు పదార్థాలు ఉన్నట్టు సమాచారంతో దాడులు చేసామని అచ్యుతాపురం సీఐ  వెంకటరమణ అన్నారు. ఎం.డి.ఎం.ఏ 4 పిల్స్, 2 ఎం.డి.ఎం. ఏ క్రిస్టల్ పౌడర్ ప్యాకెట్లు, 100 గ్రాముల గంజాయి, మహీంద్రా వాహనం, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఘటనా స్థలంలో నలుగురిని అరెస్టు చేశాం. విశాఖకు చెందిన తంగేటి భారత్ ప్రధాన నిందితుడు. తంగేటి భరత్ తో పాటు నూకరాజు, దుర్గాప్రసాద్, లక్ష్మణరావు విశాఖకు చెందిన వారే. వీరితో పాటు మరో ముగ్గురు గోవాకు చెందిన వారు కూడా ఉన్నారని అయన అన్నారు.

Related Posts