YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వరంగల్ లో అక్షయ ధరణి చిట్ ఫండ్ దౌర్జన్యం

వరంగల్ లో అక్షయ ధరణి చిట్ ఫండ్ దౌర్జన్యం

వరంగల్
వరంగల్ లో చిట్ ఫండ్  మోసాలు, ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చిట్టి డబ్బులు చెల్లించలేదని హంటర్ రోడ్ లోని భవాని ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంపై అక్షయ ధరణి చిట్ ఫండ్ సిబ్బంది దాడి చేశారు. షాప్ బంద్ చేసి రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో చిట్ ఫండ్ కు చెందిన  ఏడుగురు మూకుమ్మడిగా దాడి చేసి భవాని ఎంటర్ప్రైజెస్ యజమాని మహేష్ అతని కుమారుడు కృష్ణ ను  విచక్షణారహితంగా కొట్టారు. దాడి చేసిన విజువల్స్ సిసి కెమెరా లో రికార్డు అయ్యాయి. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. చావు దెబ్బలు తిన్న తండ్రీకొడుకులను పోలీసులు ఇద్దరిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అక్షయ ధరణి చిట్ ఫండ్ లో మహేష్ 20లక్షల చిట్టి వేయగా అవసరం కోసం 12 లక్షలకు పాటపాడి ఎత్తుకున్నాడు. చిట్టి ఎత్తుకున్న తర్వాత రెండునెలల నుంచి ఇన్స్టాల్మెంట్ చెల్లించకపోవడంతో దాడి చేశారని బాధితులు తెలిపారు. చిట్టి ఎత్తుకున్న వారికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా ఇబ్బందిపెట్టే చిట్ ఫండ్ నిర్వాహకులు, రెండు నెలలు ఆలస్యమైతే దాడి చేస్తారా అని బాధితులతో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చిట్ ఫండ్ ఆగడాలపై ఇప్పటికే వరంగల్ సీపీ తరుణ్ జోషి సీరియస్ గా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్న తరుణంలో అక్షయ ధరణి చిట్ ఫండ్  నిర్వాహకులు దాడి చేయడం వరంగల్ లో కలకలం సృష్టిస్తోంది.

Related Posts