YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వికలాంగుడి దారుణ హత్య

వికలాంగుడి దారుణ హత్య

దేవరకొండ
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో గల గుండ్లపల్లి(డిండి)మండలం పడమటి తండాలో దారుణం చోటుచేసుకుంది. జర్పుల చీన్య(45)అనే వ్యక్తిని అదే తండాకు చెందిన రాత్లావత్ పండు(35) అనే మహిళ గొడ్డలితో దారుణంగా నరికి చంపి పోలీసులకు లొంగిపోయింది. హతుడి కుమారుడు శివ తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి చీన్యకు గత 25సంవత్సరాల క్రితమే కరెంటు షాక్ తో  రెండు చేతులను మోచేతి వరకు తొలగించాల్సి వచ్చింది.  పది సంవత్సరాలుగా తన తండ్రికి పండుతో  అక్రమ సంబంధం కొనసాగుతుందని,ఇది తెలుసుకున్న గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి ఇద్దరినీ వారించారని అన్నారు. ఆదివారం రాత్రి పధకం ప్రకారం తన తండ్రిని పండు ఇంటికి పిలిపించి హత్యచేసిందని పోలీసులకు ఇచ్చిన  పిర్యాదులో పేర్కొన్నాడు.
నిందితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం లో తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, పెద్ద కుమారునికి పెళ్ళి చేసానని,ఇంట్లో పెద్ద కొడుకు, కోడలు,  పెళ్ళీడుకొచ్చిన కొడుకు ఉన్నారని చెప్పింది. దాంతో  ఇంకో సారి తన ఇంటికి రావొద్దని  చీన్యకు చెప్పినా వినకుండా  తన ఇంటికి వచ్చినందుకు చంపానని తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts