YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భారీగా నగదు స్వాధీనం

భారీగా నగదు స్వాధీనం


కర్నూలు పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఎస్ఈబి చెక్ పోస్ట్ వద్ద బుధవారం తెల్లవారుజామున  సి ఐ మంజుల, యస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ జరిపిన వాహన తనిఖీల్లో భారీ నగదు దొరికింది. హైదరాబాదు నుండి తిరుపతి కు వెళుతున్న ఓ ప్రవేటు ట్రావెల్ బస్సులో తనిఖీ చేయగా అందులో కర్ణాటక రాష్ట్రం, చిచ్చోలి గ్రామం,గుల్బర్గా జిల్లాకు చెందిన కిషోర్ కుమార్   అనే వ్యక్తి బ్యాగులో ముప్పైలక్షల  రూపాయలు నగదును గుర్తించారు. తాను హైదరాబాదు లోని ఓ బంగారు షాప్ లో గుమస్తా గా పనిచేస్తున్నాడని అన్నారు. తన యజమాని ఈ నగదును తిరుపతి లో వున్న యజమాని స్నేహితునికి ఇచ్చి రమ్మాడని తెలిపాడు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని చెప్పాడు. పట్టుబడిన నగదు ను తగిన ఆధారాల ధృవీకరణ పత్రాల పరిశీలన కొరకు కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ కు అప్పగించారు.

Related Posts