YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆకాశగంగలో అంజనాద్రి ఆలయానికి శంకుస్థాపన

ఆకాశగంగలో అంజనాద్రి ఆలయానికి శంకుస్థాపన

తిరుమల ఫిబ్రవరి 16
తిరుమల కొండపై ఆకాశగంగలో అంజనాద్రి ఆలయానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. అన్ని ఏర్పాట్లతో భూమి పూజ నిర్వహించారు. అయితే భూమి పూజకు కోర్టు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఆంజనేయ స్వామి జన్మస్థలం తిరుమల కొండ కాదని కర్నాటక రాష్ట్రం హంపిలోని కిస్కిందకు చెందిన గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కిస్కిందలేనే హనుమంతుడు జన్మించాడన్నది ఆయన వాదన. అయినా టీటీడీ ముందుకెళ్లింది.పలువురు సాహితీ ఆద్యాత్మిక రంగాలకు చెందినవారు కూడా టీటీడీ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే టీటీడీ ఏకంగా తిరుమలలో హనుమంతుడి జన్మస్థలం పేరిట ఆలయం నిర్మించేందుకు సిద్ధపడింది. కాగా హనుమంతుని జన్మస్థలంపై గత ఏడాది నుంచి  వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీ ఏర్పాటు :
హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు. చారిత్రక, పురాణ, పౌరాణిక, ఇతిహాసాలు, శాసనాలతో కూడిన ఆధారాలతో అందనాద్రియే హనుమంతుడి జన్మస్థలంగా కమిటీ నిర్ధారించింది. కమిటీ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో రావాలని బహిరంగ చర్చకు ఆహ్వానించామన్నారు. ఒక్కరిద్దరు వచ్చినా వారు ఆధారాలు సమర్పించలేదన్నారు. కమిటీ నివేదిక మేరకు అంజనాద్రి అభివృద్దికి స్వీకారం చుట్టామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

Related Posts