YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేందుకే తెరపైకి దళిత సిఎం పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేందుకే తెరపైకి దళిత సిఎం          పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీలో విభేదాలను రగిల్చేందుకే దళిత ముఖ్యమంత్రి అంశాన్ని మీడియా తెరపైకి తెచ్చిందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్టీ దళిత నేతను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే తాను ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధమేనని సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఖర్గే స్పందించారు. ‘‘మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ఈ అంశాన్ని మీడియా తెరపైకి తెచ్చింది. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. అధిష్ఠానం దీన్ని నిర్ణయిస్తుంది. ఇది 12 గంటల్లో జరిగేపోయే పని’’ అని ఖర్గే స్పష్టం చేశారు.కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి శనివారం పోలింగ్ ముగియగా, రేపు (మంగళవారం) ఫలితాలు వెల్లడి కానున్నాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కర్ణాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని తెలిపిన విషయం గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ అటు బీజేపీ, ఇటు అధికార కాంగ్రెస్, జేడీఎస్ మూడు కూడా తామే అధికారంలోకి వస్తామని ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించి నిజంగా దళిత అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే అందుకు పార్లమెంటరీ నేతగా ఉన్న ఖర్గే ప్రధాన అభ్యర్థిగా ముందుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Related Posts