YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

బయో ఆసియా సదస్సు కు ఏర్పాట్లు పూర్తి

బయో ఆసియా సదస్సు కు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్  బయో ఆసియా సదస్సుకు సిద్ధమైంది.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురు, శుక్ర వారాల్లో (24, 25 తేదీల్లో) జరిగే ఈ అంతర్జాతీయ సదస్సును ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.  కరోనా నేపథ్యంలో గతేడాది లాగానే ఈసారి కూడా ఈ సదస్సును వర్చువల్ గానే నిర్వహిస్తున్నారు.
టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలకు చెందిన దాదాపు 50 మంది దేశ, విదేశీ ప్రముఖులు 7 ప్యానల్స్ గా ఏర్పడి ఈ సదస్సులో ప్రసంగించబోతున్నారు. గురువారం జరిగే ఫైర్ చాట్ లో కేటీఆర్, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య జరగనున్న సంభాషణపైనే అందరి దృష్టి వుండబోతోంది.  కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, భవిష్యత్లో చెలరేగే అవకాశమున్న వ్యాధులను ముందుగానే గుర్తించి నిలువరించడమెలా? అనే అంశాలు ఈ ఫైర్ చాట్ లో ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది..
మొదటిరోజు 3 అంశాలపై..
ఇక ఈ సదస్సు తొలిరోజు ‘టు ఇయర్స్ ఇన్ టు ది పాండమిక్’, ‘ఫార్మా అండ్ టెక్ కొలాబరేషన్-ఏ రెసిపీ ఫర్ సక్సెస్’, ‘మెడ్టెక్ ఇండస్ట్రీ’ అనే మూడు అంశాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ‘టు ఇయర్స్ ఇన్ టు ది పాండమిక్’ అంశంపై జరిగే చర్చలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, బయోలాజికల్ ఈ సంస్థ ఎండీ దాట్ల మహిమ తదితరులు పాల్గొంటారు.
రెండవ రోజు కీలక చర్చ
ఇక రెండో రోజున.. ‘ఔషధ రంగంలో పరిశోధన, అభివృద్ధి-నిన్న, నేడు, రేపు’ అనే అంశంపై కీలక చర్చ జరగనుంది.. బయోకాన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులు ఈ చర్చలో పాల్గొంటారు. అలాగే అనంతరం సీఈవో కాంక్లేవ్లో పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో చైర్మన్, ఎండీ జేవీ ప్రసాద్ తదితరులు పాల్గొంటారు.

Related Posts