YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఆడవిలో మావోయిస్టుల బీభత్సం రైలు ఇంజన్ కు నిప్పు

ఆడవిలో మావోయిస్టుల బీభత్సం రైలు ఇంజన్ కు నిప్పు

విశాఖపట్నం
ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి, భాన్సీ మధ్య, బచేలి నుండి విశాఖపట్నంకు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును మావోయిస్టులు అడవిలో ఆపివూసారు. గత రాత్రి జరిగిన ఈ ఘటలో మావోయిస్టులు బీభత్సం సృష్టించి ఇంజిన్కు నిప్పంటించారు. 15 నుంచి 20 మంది సాయుధ నక్సలైట్లు ఆయుధాలతో వచ్చి రైలును నిలిపివేసి, ముందుగా దాని పైలట్,  గార్డును దించి, ఆపై ఇంజిన్కు నిప్పంటించారని చెబుతున్నారు.   చాలా కాలం తర్వాత మరోసారి నక్సలైట్లు తమ ఉనికిని చాటుకోవడంతోపాటు  ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు. కిరండోల్ నుండి విశాఖపట్నం రైలు మార్గంలో రవాణా నిలిచిపోయింది. రైల్ ఇంజన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోవడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Posts