YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పాన్ ఇండియా కోసం రంగంలోకి మహేష్ బాబు

పాన్ ఇండియా కోసం రంగంలోకి మహేష్ బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 23  (న్యూస్ పల్స్)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం డార్లింగ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు రాధేశ్యామ్ మర్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ప్రతి రోజు ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే. అయితే అమితాబ్ తోపాటు ఇప్పుడు రాధేశ్యామ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రంగంలోకి దిగనున్నారని టాక్ వినిపిస్తుంది.పాన్ ఇండియా రేంజ్ లో రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హిందీ వర్షన్ లో అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. అలాగే తెలుగు వర్షన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ పాత్రను మహేష్ పరిచయం చేయడమే కాకుండా మధ్య మధ్య లోకూడా మహేష్ వాయిస్ వినిపిస్తుందట. అలాగే క్లైమాక్స్ లోకూడా మహేష్ వాయిస్ ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాకు మహేష్ వాయిస్ ఇవ్వనున్నాడన్న వార్త తెలిసి ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ ను కలిసిందుకు వెళ్లిన సమయంలో మహేష్ , ప్రభాస్ ఎంతో సరదాగా మాట్లాడుకోవడం చూసి ఫ్యాన్స్ తెగ సంబర పడిపోయారు. ఇక మహేష్ గతంలోనూ పలు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు తారక్ నటించిన బాద్షా సినిమాకు మహేష్ వాయిస్ ఇచ్చారు.

Related Posts