YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో భీమ్లా హల్ చల్

విశాఖలో భీమ్లా హల్ చల్

విశాఖపట్నం
ఈ సమ్మర్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కరోనా వైరస్ పేరుతో పట్టిన దుమ్ముదులిపేందుకు స్టార్ హీరోలందరూ కూడా సిద్ధమైపోయా రు.ఈ క్రమంలోనే వరుసగా సినిమాల ను విడుదల చేసేందుకు రెడీ అయ్యా రు.పరిస్ధితులు అనుకూలించక వాయి దా పడుతూ వస్తున్న బీమ్లానాయక్ పవన్ మూవీ ఎట్టకేలకు విడుదల కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతు న్నారు.ముఖ్యంగా అందరి కంటే ముందు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతో పవర్ స్టార్ మూవీకి గ్రాడ్ గా వెల్ కమ్ చెప్పారు.విశాఖలో పలు ధియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ కటౌట్ ఏర్పాటు చేసి సందడి చేశారు.

మదనపల్లిలో పవన్ అభిమానుల సందడి
చిత్తూరు జిల్లా  మదనపల్లిలో బీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉదయం ఆరు గంటలకే థియేటర్ల వద్ద చేరుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు సినిమా పదిన్నరకు ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో పెద్ద సంఖ్యలో కర్ణాటక నుంచి కూడా అభిమానులు మదనపల్లి చేరుకున్నారు. రాత్రి నుంచి థియేటర్ల వద్ద టికెట్ల కోసం అభిమానుల తిరుగుతున్నారయ.  మరోవైపు జనసేన నాయకులు థియేటర్ల వద్దకు చేరుకొని హడావిడి చేస్తున్న పరిస్థితి కనిపించింది.

యానాంలో భీమ్లా నాయక్ సందడి
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజవర్గంలో భీమ్లా నాయక్ సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో బెనిఫిట్ షోలకు కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు పవన్ అభిమానులు చేరుకున్నారు. యానాం శ్రీ పద్మ, వీరేశ్వర థియేటర్ లో తెల్లవారుజామున 5.30గంటలకు భీమ్లా నాయక్ బెనిఫిట్ షో ప్రారంభం అయింది. యానాంలోని  థియేటర్లలలో మాత్రమే బెనిఫిట్స్ షో వేయడంతో భీమ్లా నాయక్  సినిమా చూసేందుకు తరలి వచ్చిన పవన్ అభిమానులతో థియేటర్ సమీపంలోని రోడ్లన్నీ వాహనాలను, కార్ల తో కిక్కిరిసిపోయాయి. .

Related Posts