ఆదిలాబాద్
ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో శివఆలయాలు మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కత్తెరశాల మల్లన్న, బుగ్గ రాజేశ్వర ఆలయం, వేలాల మల్లన్న, చెన్నూర్ శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు గోదావరి తీరా ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు...ఆసిఫాబాద్ జిల్లాలో లోని ఈస్లాం మల్లన్న శివాలయంలో సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ, పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది