YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

శంషాబాద్ లో చోరీ

శంషాబాద్ లో చోరీ

శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగుడా గ్రాండ్ విల్లే  వెంచర్ లో నివాసం ఉండే రవిందర్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. రవిందర్ రెడ్డి ఇంటికి తాళం వెసి కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ వెళ్ళాడు. అదును చూసిన గుర్తుతెలియని దుండగులు తాళం పగలగొట్టి 15 తులాల బంగారం నాలుగు లక్షల నగదు తో ఉడాయించారు. ఊరు నుండి వచ్చిన రవిందర్ రెడ్డి ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్ళి చూడగా బంగారం తోపాటు నగదు కనిపించలేదు. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు.

Related Posts