YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

7 న పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భారీ సైనిక డ్రిల్‌

7 న పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భారీ సైనిక డ్రిల్‌

న్యూఢిల్లీ మార్చ్ 3
పాకిస్థాన్‌ సరిహద్దుల్లో యుద్ధవిమానాలను గర్జించేందుకు భారత వైమానికదళం సిద్ధమవుతున్నది. వాయుశక్తి యుక్తి-2022 పేరిట నిర్వహిస్తున్న ఈ నెల 7 న జరిపే ఈ భారీ సైనిక డ్రిల్‌లో 148 యుద్ధవిమానాలు పాల్గొననున్నాయి. రాఫెల్‌ ఫైటర్లు కూడా పాల్గొనేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జైసల్మేర్‌లోని పోఖ్రాన్ వద్ద జరగనున్న ఈ సైనిక డ్రిల్‌కు ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. 75 ఫార్మేషన్స్‌లో 17 జాగ్వార్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కార్యక్రమం ప్రారంభమవుతుందని భారత వైమానికదళానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాఫెల్, తేజస్, సుఖోయ్-30.. మూడు రకాల జెట్‌లతో ‘ట్రాన్స్‌ఫార్మర్ ఏరోబాటిక్ డిస్‌ప్లే’ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు చినూక్, ఎంఐ17వీ5, ఎంఐ35, ఎల్‌సీహెచ్‌ వంటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లు కూడా ఈ వ్యాయామంలో పాల్గొంటాయి. భారత వైమానిక దళం తన సంసిద్ధతను ప్రదర్శించేందుకు ప్రతి మూడేండ్లకోసారి వాయుశక్తి డ్రిల్‌ నిర్వహిస్తుంది. 2019లో చివరిసారిగా డ్రిల్‌ జరిగింది.సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. ఆకాష్ క్షిపణి వ్యవస్థ, స్పైడర్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా ఈ డ్రిల్‌లో ప్రదర్శించనున్నారు. సీ-17, సీ-130 జే రవాణా విమానాలు కూడా ఈ ఎక్సర్‌సైజులో భాగం కానున్నాయని అధికారులు తెలిపారు.

Related Posts