YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు బెల్లంకొండ సురేష్

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు బెల్లంకొండ సురేష్

హైదరాబాద్
నన్ను నా ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగమే నా ఫై నమోదు అయిన కేసు అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. నాకు శరన్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. నా ఫై నా కొడుకు ఫై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరన్ ఒక్క పైసా మాకు ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు  ఇవ్వాలని అన్నారు. శరన్ తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు. నేను డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా. బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే  కేసులు పెడ్తున్నారు. పోలీసుల విచారణకు సహరిస్తా.  85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఆరోపణలు చేశారు. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. నా పిల్లలు జోలికి వచ్చాడు. నా పిల్లలు నా పంచ ప్రాణాలు. శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటా. అతని పై పరువు నష్టం దావా వేస్తా. ఏదన్నా ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలని అన్నారు. నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు. నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు. నా పై చేసిన ఆరోపణల పై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్ కు నోటీసులు ఇచ్చారు. శరణ్ ది మా ఊరే... పదేళ్ళ క్రితం పరిచయం.. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడు. శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు.. అతని క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను. బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు. శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో బయట పెడతాని అన్నారు. 

Related Posts