YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య

తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య

బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ గా పనిచేస్తున్న దుర్గం బాబు రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేశారు. రక్తపు మడుగులో ఉన్న దుర్గం బాబు ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటన స్థలానికి  చేరుకుని  విచారణ చేబడుతున్న పోలీసులు. మృతునికి నలుగురు కుమార్తెలు , ఒక కుమారుడు. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఈ ఘటన జరగడంతో సిబ్బంది ఆందోళన గురి అవుతున్నారు.

Related Posts