YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మే 28న రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు

 మే 28న రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు సంబంధించి.. జయనగర్, రాజరాజేశ్వరీ నగర్ నియోజకవర్గాల్లో వాయిదాపడ్డా పోలింగ్‌ను మే 28న నిర్వహించనున్నారు. జయనగర్ బీజేపీ ఎమ్మెల్యే బి.ఎన్ వినయ్‌కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అక్కడ జరిగే పోలింగ్‌ను వాయిదావేశారు. ఎన్నికల అధికారులు జరిపిన సోదాలో.. అక్రమ ఓటర్ ఐడీకార్డులు బయటపడటంతో రాజరాజేశ్వరీనగర్ నియోజకవర్గంలో జరగాల్సిన పోలింగ్‌ను కూడా వాయిదావేయాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గానికి మే 28న ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటే జయనగర్ నియోజకవర్గంలో కూడా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక శాసనసభలో మే 12న 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. మే 8న రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గం పరిధిలో.. ఎన్నికల అధికారులు జరిపిన సోదాల్లో 9 వేలకు పైగా నకిలీ ఓటర్ కార్డులు బయటపడిన సంగతి తెలిసిందే. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు రద్దు చేశారు. మరోవైపు జయనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా సినీ నటి, ఎమ్మెల్సీ తార అనురాధను పోటీ చేయించే అవకాశం ఉంది. 

Related Posts