YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆలేరు మైనార్టీ రెసిడెన్షియల్ హాస్ట్‌లో కీచకపర్వం

ఆలేరు మైనార్టీ రెసిడెన్షియల్ హాస్ట్‌లో కీచకపర్వం

నల్గొండ, మార్చి 21,
ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే బాలికల పట్ల లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏదైనా ఘటన జరిగిన తర్వాత అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని వదిలిపెట్టడంతో మళ్లీ ఇలాంటి ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవలోనే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే ఓ బాలిక రాసిన ఉత్తరం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా మైనార్టీ అధికారి, జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ, మీడియా రిపోర్టర్లను వేడుకుంటూ ఆ బాలిక రాసిన ఉత్తరంతో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే కొంతమంది సిబ్బంది బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంచడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారని, వారి బారి నుంచి తమను కాపాడాలంటూ బాలిక వేడుకోవడం చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. రెసిడెన్షియల్ స్కూల్ సెక్యురిటీ గార్డులు గౌస్, సాజియాలు హాస్టల్ సీక్ రూమ్‌లో బట్టలు లేకుండా అసభ్యకర రీతిలో తిరుగుతుంటారని, ఆడపిల్లలు స్నానం చేస్తుండగా గదుల్లోకి దూరి నీచంగా ప్రవర్తిస్తున్నారని బాలిక ఉత్తరంలో తెలిపింది. దీంతో పాటు బయటి నుంచి కొందరు వ్యక్తులను తీసుకొచ్చి వారికి శారీరక సుఖం అందించాలని వేధింపులకు గురిచేస్తున్నారని, హాస్టల్‌కు సమీపంలోనే స్కూల్‌లో పనిచేసే కొందరు సిబ్బంది గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారని, చాలామంది అమ్మాయిలను అక్కడికి తీసుకెళ్లి శారీరక వాంఛలు తీర్చుకుంటున్నారని తెలిపింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలికలను నిద్రలేపి వేరే చోటికి తీసుకెళ్లున్నారని, పరాయి వ్యక్తుల పక్కన పడుకోబెట్టి భారీగా డబ్బులు తీసుకుంటున్నారని తెలిపింది. తమకు ఇష్టం లేని, నొప్పిగా ఉందని చెప్పినా వినిపించుకోకుండా చిత్రహింసలు చేస్తున్నారని వాపోయింది. పైగా ఈ విషయం బయటికి చెబితే టీసీలు ఇచ్చి ఇంటికి పంపించేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. వారి మాటలు వినకపోతే శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడంతో పాటు భోజనం కూడా పెట్టడం లేదని ఉత్తరంలో తెలిపింది. ఆ కామాంధుల బారి నుంచి తమను రక్షించాలని బాలిక లేఖలో వేడుకుంది. ఆలేరు పట్టణంలోని కొలనుపాక రోడ్డులో 2017లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారు. ఇక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్‌లో మొత్తం 330 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరిలో 9వ తరగతి 59, పదో తరగతి 41 మంది, ఇంటర్ ఫస్టియర్ 38 మంది చదువుతుండగా.. మిగిలిన 192 మంది విద్యార్థినులు 5-8 తరగతులు చదువుతున్నారు.

Related Posts