YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

24 ఏళ్ల పాటు అన్న ఉద్యోగం చేసిన తమ్ముడు

24 ఏళ్ల పాటు అన్న ఉద్యోగం చేసిన తమ్ముడు

బెంగళూర్, మార్చి 26,
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందిన ఓ వ్యక్తి పోస్టింగ్‌లో చేరకముందే మృతిచెందాడు. అయితే, అతడి స్థానంలో తమ్ముడు ఉద్యోగంలో చేరి.. 24 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ జర్నలిస్ట్ పరిశోధనతో అన్న ఉద్యోగాన్ని తమ్ముడు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు రెండేళ్ల పాటు సమగ్ర విచారణ జరిపి.. అన్న స్థానంలో అతడు చేరినట్టు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూర్ జిల్లా కేఆర్ నగర్ తాలూకా హెబ్బా గ్రామానికి చెందిన లోకేశ్ గౌడ 1994-95లో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. అయితే, విధుల్లో చేరకుండానే లోకేశ్ హఠాన్మరణం చెందారు. దీంతో అతడి తమ్ముడు లక్ష్మణ్ గౌడ అన్న ఉద్యోగాన్ని తాను దక్కించుకోవాలని పథకం వేశాడు. ఇందుకు కుటుంబసభ్యులు కూడా సహకరించడంతో తాను లోకేశ్ గౌడగా పేర్కొంటూ సంబంధిత పత్రాలను సృష్టించాడు. వీటి సాయంతో ఉద్యోగంలో చేరాడు.వంశవృక్షం నుంచే అన్నను లేకుండా చేసి.. పెరియపట్న తాలూకాలోని ముద్దనహళ్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి.. తర్వాత హనసూర్ సమీపంలోని కెట్టామలాల్‌వడీ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌కు బదిలీ అయ్యాడు. అతడి నియామకం గురించి కుటుంబ సభ్యులు పెదవి విప్పనప్పటికీ.. స్వగ్రామంలోని ప్రజలు చాలా సందేహాలు వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ శాఖ దృష్టి తీసుకెళ్లినా అది అక్కడే నిలిచిపోయింది.రెండేళ్ల కిందట ఓ జర్నలిస్ట్‌కు ఈ విషయం తెలియడంతో ఆయన వివరాలను సేకరించి ఉన్నతాధికారులు అందజేశారు. దీంతో అతడి వంశవృక్షం, కుటుంబసభ్యుల గురించి సమాచారం సేకరించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే కుటుంబసభ్యులు నోరు మెదపడం లేదని, సమాచారం బయటపెట్టడం లేదని తహశీల్దార్ డీడీపీఐకి లేఖ రాశారు. ఈ కేసును డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీడీపీఐ)కి దృష్టికి తీసుకెళ్లడంతో కేసును కొత్తగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.అలాగే, ఈ కేసు లోకాయుక్త వద్దకు చేరడంతో విచారణలో నియామక పత్రం లోకేశ్ గౌడ్‌కే ఇచ్చారని, లక్ష్మణ్ గౌడకు కాదని తేలింది. 24 ఏళ్ల కిందట రెవెన్యూ అధికారులు జారీ చేసిన వంశవృక్షం, సర్వైవర్స్ సర్టిఫికెట్ కూడా నకిలీదని తెలియడంతో వెనక్కి తీసుకున్నట్లు డీడీపీఐ రామచంద్ర రాజే ఉరసు తెలిపారు. చివరకు మోసపూరితంగా ఉద్యోగంలో చేరినట్టు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు

Related Posts