YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఐపీఎల్ టోర్నీ నుంచి బట్లర్, స్టోక్స్ అవుట్..!!

ఐపీఎల్ టోర్నీ నుంచి బట్లర్, స్టోక్స్ అవుట్..!!

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కి పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టులో ఉన్న ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఇంగ్లాండ్ విధ్వంసకర  ఆటగాళ్లు స్టోక్స్, బట్లర్.  పాకిస్థాన్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ తాజాగా జట్టును ప్రకటించింది. ఇందులో బట్లర్‌, స్టోక్స్‌ చోటు దక్కించుకున్నారు. పాకిస్థాన్‌-ఇంగ్లాండ్ మధ్య మే 24న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ ఐపీఎల్‌ను వదిలి స్వదేశానికి వెళ్లనున్నారు. వెంటనే ఇంగ్లాండ్‌ వచ్చి జట్టు సభ్యులతో కలవాలని బోర్డు నుంచి స్టోక్స్‌, బట్లర్‌కు ఆదేశాలు అందాయి.  దీనితో నిన్న కోలకతా తో జరిగిన మ్యాచ్ ఆఖరి మ్యాచ్ అని తెలుస్తుంది.
 

Related Posts