YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళా నిర్బంధం.. చిత్రహింసలతో హత్య

మహిళా నిర్బంధం.. చిత్రహింసలతో హత్య

బద్వేలు
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల పోలీస్ సర్కిల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది  అక్రమ సంబంధం పేరుతో షేక్ మున్ని (30) అనే మహిళను నిర్బంధించి చిత్రహింసల పాలు చేసి ఆ తర్వాత దారుణంగా గాయపర్చారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను మంగళవారం కడప ఆసుపత్రికి తీసుకు పోవడం జరిగింది. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం సంచలనమైంది వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు చెందిన షేక్ మున్ని కి కలసపాడు మండలం రామాపురం కు చెందిన ఒక వ్యక్తి తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలానికి వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.  ఆమె సంవత్సరం నుంచి కడప జిల్లా పోరుమామిళ్ల లోని ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తుంది. అక్కడే ఒక బాడుగ ఇల్లు తీసుకొని తల్లి షకీలా తో ఉంటుంది. సూపర్ మార్కెట్ యజమాని మాబు హుస్సేన్ తో మున్ని సన్నిహితంగా ఉంటున్నట్లు ప్రచారం ఉంది.  ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తుంది.  మున్ని 5 నెలల క్రితం సూపర్ మార్కెట్లో పని మానేసి గిద్దలూరు లో ఉంటుంది. అయినప్పటికీ మాబు హుస్సేన్ కుటుంబముతో గొడవలు మరింత ఎక్కువయ్యాయి.  దీనికంతటికీ మున్ని కారణమని భావించిన మాబు హుస్సేన్ కుటుంబ సభ్యులు కానిస్టేబుళ్లు జిలాని,  సయ్యద్ లను వెంటబెట్టుకొని సోమవారం సాయంత్రం గిద్దలూరు కి వెళ్లారు. మున్ని ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని పోరుమామిళ్ల కు తీసుకువచ్చారు. ఆమెను కార్ లో ఎక్కించు ముందే కానిస్టేబుల్ ఇద్దరూ మరి కొంతమంది కలిసి ఆమెను ఇష్టానుసారంగా కొట్టారని స్థానికులు చెబుతున్నారు

Related Posts