YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తోలి రోజే కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి

తోలి రోజే కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి

అమరావతి ఏప్రిల్ 16
అతడు రాజకీయాల్లో తలపండిన నేత.. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా పనిచేసిన నాయకుడు. ఐదోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సొంత నియోజకవర్గంలో పర్యటించిన రోజే ఓ కార్యకర్తపై అతడు చేయిచేసుకోవడం విమర్శలకు దారితీస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా నియోజక వర్గ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన మంత్రిని కలిసేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపారు. కారు దిగిన మంత్రితో కరచాలనం చేసేందుకు పోటాపోటిపడ్డారు. మంత్రి కరచాలనం చేస్తుండగా ఓ వీరాభిమాని మంత్రి చేయిని గట్టిగా పట్టుకుని లాగాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు కార్యకర్తపై చేయిచేసుకోవడం అక్కడికి వచ్చిన వైసీపీ నాయకులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Related Posts