YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసిపి ఒక డొల్ల ప్రభుత్వం... బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

వైసిపి  ఒక డొల్ల ప్రభుత్వం...  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

విజయవాడ
భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో  విజయవాడ క్రుష్ణా నది వడ్డున స్వచ్చ భారత్ నిర్వహించారు. విజయవాడ జిల్లా  బిజెపి  ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అథ్యక్షుడు  సోమువీర్రాజు పాల్గొని స్వచ్చ భారత్ నిర్వహించారు. క్రుష్ణా నదీ తీరంలో సుమారు గంటకు పైగా పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించారు. బిజెపి నాయకులంతా చీపుళ్ళు  చేత పట్టి చెత్తను తొలగించారు. బిజెపి నేతలకు స్ధానికులు కూడా సహకరించారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ స్వచ్చభారత్ నిర్వహణకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంటే  ఆంధ్రప్రదేశ్ లో మాత్రం  సవ్యంగా ఖర్చు చేయడం లేదని  సోమువీర్రాజు ఆరోపించారు. నగర పంచాయితీ ల నుండి  మున్సిపల్ కార్పోరేషన్  లవరకు  అందంగా తీర్చిదిద్ది సౌకర్యవంతంగా మార్చడానికి స్వచ్చ భారత్  కార్యక్రమాన్ని వినియోగించు కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ పధకాన్ని ప్రవేశపెడితే ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా సవ్యంగా స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించడంలేదన్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి స్వచ్చ భారత్  నిర్వహిస్తోంది. సంవత్సరానికి  రాష్ట్రానికి వెయ్యి కోట్లు  కేంద్రం నిధులు విడుదల చేస్తోంది.
పేదలకు ఇళ్ళ నిర్మాణం విషయంలో వైసిపి  ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 32 వేల కోట్లు నిధులు మంజూరు చేస్తే  నిర్మాణం లో ఉన్న ఇంటికి పన్ను వేస్తున్నారు. మౌలిక వసతులు కల్పించకుండా అంటే విద్యుత్, డ్రైయినేజ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా ఎలా పన్నులు వసూలు చేస్తారని  బిగ్గర స్వరంతో  ఆరోపించారు. డొల్ల ప్రభుత్వాన్ని  బిజెపి లెక్క చేయదు ఈ విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ డొల్ల ప్రభుత్వం  అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులు ఏంచేశారని తీవ్ర స్వరం తో సోమువీర్రాజు ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు,బిజెపి విజయవాడ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం,    ఒబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసం ఉమామహేశ్వర రాజు, బిజెపి  స్వచ్చభారత్  జిల్లా కన్వీనర్  ఎర్ర రవి చౌదరి బిజెపి నేతలు యర పోతు మురళి, భొగవల్లి శ్రీధర్, పోతురెడ్డి వెంకట్, మాచర్ల శ్రీనివాస్, బిఎస్ కె పట్నాయక్, బొప్పన మురళి, నూశెట్టిరంగారావు, మోగంటి వీర బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts