YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ యాత్రను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు

బీజేపీ యాత్రను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు

గద్వాల
ఐదో రోజు బిజెపి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం బండి సంజయ్ పాదయాత్ర బయలుదేరి క్రమంలో లో.. తెరాస కార్యకర్తలు వేముల గ్రామంలో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు ప్రయత్నంలో భాగంగా కొంత మంది కార్యకర్తలు కిందపడిపోయారు.. ఒకరిపై ఒకరు కట్టెలు , రాళ్లతో  కొట్టుకుని పరిస్థితి చెయ్యి దాటే క్రమంలో... ఒక్కసారిగా పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రయత్నం చేశారు..  ఒకింత అసహనంతో బిజెపి కార్యకర్తలు తెరాస కార్యకర్తల వైపు కొట్టడానికి దూసుకెళ్లారు.. చివరకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ కలుగజేసుకొని కార్యకర్తలను శాంతింపజేసి పాదయాత్ర కొనసాగె టట్లు చేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో కార్యకర్తలు పాదయాత్ర మొదలుపెట్టారు..

Related Posts