YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వికలాంగ క్రీడాకారులకు ఎంపీ ఆదాల సన్మానం

వికలాంగ క్రీడాకారులకు ఎంపీ ఆదాల సన్మానం

నెల్లూరు
జాతీయ స్థాయిలో పారా స్పోర్ట్స్, గేమ్స్ లో ప్రతిభ చూపిన వికలాంగ క్రీడాకారుల ను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం సన్మానించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వి.భవాని (అథ్లెటిక్స్) వి. రామ్ తేజ (అథ్లెటిక్స్) చరిత్ (స్విమ్మింగ్) టి. సురేష్ (అథ్లెటిక్స్) లను సన్మానించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు రైల్వేలో ఉద్యోగాలకు సిఫార్సు చేస్తానని ఎంపీ ఆదాల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, మైపాడు అల్లాబక్షులను  క్రీడాకారులు సన్మానించారు. జిల్లా పారా స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, ప్రధాన కార్యదర్శి కటారి యాదగిరి, సలహాదారు మైపాడు అల్లాబక్షు, మధు తదితరులు పాల్గొన్నారు.

Related Posts