YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పుష్ప తరహాలో స్మగ్లింగ్

 పుష్ప తరహాలో స్మగ్లింగ్

హైదరాబాద్, ఏప్రిల్ 19,
తెలుగు రాష్ట్రాల్లో మత్తు రవాాణా ఆగడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రత్యేక టీమ్స్ అదే పనిగా దాడులు చేస్తున్నా..  డ్రగ్ పెడ్లర్స్ కొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు. పుష్ప  సినిమాలో రెడ్ శాండిల్ అక్రమంగా తరలించేందుకు హీరో అల్లు అర్జున్ అనుసరించిన ట్రిక్స్‌ను..  ఇప్పుడు గంజాయి స్మగ్లర్స్ ఫాలో అవుతున్నారు. తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తిలో 500కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని నర్సీంపట్నం నుంచి వరంగల్ వైపు వస్తున్న కారును ఆపి పోలీసులు సోదాలు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించంగా అసలు బాగోతం వెలుగుచూసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు వెనకవస్తున్న లారీలో సోదాలు చేయగా గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ కిందిభాగంలో ప్రత్యేకంగా ఒక సెల్ఫ్ ఏర్పాటుచేసి అందులో గంజాయి ప్యాకెట్లు దాచారు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా స్కెచ్ వేశారు.అంతే కాదు కారులో కూడా డిక్కీ, సీట్ల కింద 240 ప్యాకెట్లను కనిపించకుండా దాచారు. మొత్తం 500 కిలోల గంజాయి గుర్తించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తెలిపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వివరించారు.

Related Posts