YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ కు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.

విశాఖ కు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.

విశాఖపట్నం, ఏప్రిల్ 19
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 11:40 గంటలకు విమానాశ్రయానికి  చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్నదొర, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రోడ్లు భవనాలు శాఖ మంత్రి దాడి శెట్టి రాజా, ఎంపీలు ఎం.వి.వి. సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, సత్యవతి, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాస్, శాసన మండలి సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కల్యాణి, శాసన సభ్యులు ధర్మ శ్రీ, నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి పుష్ప గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. తదుపరి ముఖ్యమంత్రి వి.ఐ.పి. గ్యాలరీకి వెళ్లి అక్కడకు విచ్చేసిన పలువురు ప్రజా ప్రతినిధులను కలిసి మాట్లాడారు. అనంతరం రుషికొండ పరిధిలోని వెల్ నెస్ కేంద్రానికి చేరుకొని హర్యానా ముఖ్యమంత్రిని  కలవడానికి బయలు దేరి వెళ్లారు.

Related Posts