YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తడిసి మోపడవుతున్న సెక్రటేరియెట్ ఖర్చు

తడిసి మోపడవుతున్న  సెక్రటేరియెట్ ఖర్చు

హైదరాబాద్, ఏప్రిల్ 23,
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సెక్రటేరియెట్ ఖర్చు తడిసిమోపెడవుతోంది. ముందుగా అనుకున్న గడువులోపు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఖర్చు అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే సెక్రటేరియెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎంత ఖర్చయినా పర్లేదని.. ఈ దసరాలోపు సెక్రటేరియెట్‌ నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీకి ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలోనే నిర్మాణం తుది దశకు చేరుకున్నాక వ్యయం లెక్కలు ఫైనల్ చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.ముందుగా ఆరు ఫ్లోర్లు.. ఆరు లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియెట్ నిర్మాణానికి రూ.400 కోట్లు అవుతుందని అంచనా వేసి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత టెండర్ల సమయంలో అది పెరిగి రూ.494 కోట్లకు చేరింది. ఈ క్రమంలోనే షాపూర్జీ పల్లోంజీ 4 శాతం ఎక్కువగా రూ.514 కోట్లు కోట్‌‌ చేసి టెండర్‌‌ ప్రక్రియలో ఎల్-1గా నిలిచింది. అయితే కొద్ది రోజుల‌‌కే మరోసారి ఈ అంచ‌‌నాలని పెంచాల్సి వచ్చింది. ఒక ఫ్లోర్ పెరిగిందని, ఇంకో లక్ష చదరపు అడుగులకు అంచనా వ్యయం రూ.219 కోట్లు అవుతుందంటూ మొత్తం వ్యయం రూ.619 కోట్లకు పెంచారు.. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అయితే ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ ధరలు పెరిగినందున నిర్మాణ ఖర్చు రూ.800 కోట్లు అవుతుందన్నారు. ఆ తర్వాత అది మళ్లీ రూ.వెయ్యి కోట్లకు చేరుకుంది.. ఇక ఈ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే నాటికి ఖర్చు రూ.1,200 కోట్లు చేరుతుందని సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.2020 అక్టోబర్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ సెక్రటేరియెట్ నిర్మాణం టెండర్లు దక్కించుకుంది. అప్పుడు 12 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని టెండర్‌‌లో తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వైరస్ వ్యాప్తితో కూలీలు ఇంటికి వెళ్లడంతో పనులు కొద్దిరోజుల పాటు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాత కొన్ని డిజైన్లు మార్పులు చేయాల్సి వచ్చింది.. పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటెయిన్‌కు రాజస్తాన్‌లోని ప్రఖ్యాత ధోల్పూర్‌ ఎర్ర ఇసుక రాయిని వినియోగించారు. అదే రాయిని తెలంగాణ సచివాలయ ఫౌంటెయిన్‌కు కూడా వాడాలని నిర్ణయించారు. అలాగే సర్కార్ అప్పటికప్పుడు మార్పులు సూచిస్తుండటంతో ఎలివేషన్, టైల్స్, హాల్స్, పిల్లర్స్ డిజైన్లు మార్చడంతో మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఈసారి విజయదశమిలోపు సెక్రటేరియెట్ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు.

Related Posts