YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి దారుణ హ‌త్య‌

ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి దారుణ హ‌త్య‌

లక్నో ఏప్రిల్ 23
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న ప్ర‌యాగ్రాజ్ జిల్లాలోని ఖ‌వాయిపుర్ ప్రాంతంలో జ‌రిగింది. మృతిచెందిన అయిదుగురిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. బాధితుల్లో రామ్ కుమార్ యాద‌వ్‌(52), ఆయ‌న భార్య కుసుమ్ దేవి(52), కూతురు మ‌నీషా(25), కోడ‌లు స‌విత‌(27), మ‌న‌వ‌రాలు మీనాక్షి(2)లు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో అయిదేళ్ల మ‌న‌వ‌రాలు సాక్షి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. హత్యలు జరిఇ సమయంలో రామ్ యాద‌వ్ కుమారుడు సునీల్‌(30)  ఇంట్లో లేడు. అయితే కేసు విచార‌ణ‌లో అత‌ను స‌హ‌క‌రిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. మృతిచెందిన వారి శ‌రీరాల‌పై రక్తపు మ‌ర‌క‌లు ఉన్నాయ‌ని, అంద‌రి త‌ల‌పై గ‌ట్టిగా కొట్టిన‌ట్లు తెలుస్తోంద‌ని పోలీసులు వెల్ల‌డించారు.మృత‌దేహాల‌ను పోస్టు మార్ట‌మ్ నిమిత్తం హాస్పిట‌ల్‌కు పంపారు. నేర‌స్థుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు ఏడు బృందాలుగా అన్వేషిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌, ఫోరెన్సిక్ నిపుణులు కూడా క్రైమ్ సీన్‌కు వ‌చ్చారు. యాద‌వ్ ఇంట్లో తొలుత మంట‌ల చెల‌రేగిన‌ట్లు స్థానికులు చెప్పార‌ని జిల్లా మెజిస్ట్రేట్ సంజ‌య్ కుమార్ ఖ‌త్రి తెలిపారు.ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన కూడా ఓ దారుణ‌మైన నేరం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతిచెందారు. 38 ఏళ్ల ప్రీతి తివారితో పాటు ఆమె ముగ్గురు కూతుళ్ల గొంతు కోశారు. ప్రీతి భ‌ర్త రాహుల్ ఉరివేసుకుని మృతిచెందాడు. బంధువుల వేధింపుల వ‌ల్లే ఆత్‌్హ‌త్య చేసుకున్నట్లు రాహుల్ త‌న సూసైడ్ లేఖ‌లో రాశారు.

Related Posts