YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చింతూరులో రెచ్చిపోయిన మావోయిస్టులు.. హైవేపై అర్ధరాత్రి బస్సు దగ్ధం

చింతూరులో రెచ్చిపోయిన మావోయిస్టులు.. హైవేపై అర్ధరాత్రి బస్సు దగ్ధం

ఏజేన్సీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు బస్సును తగలబెట్టారు. ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్న మావోయిస్టులు ప్రయాణికులను దించి దాన్ని తగులబెట్టారు. ఈ ఘటన చింతూరు మండలం కొత్తూరు దగ్గర చోటుచేసుకుంది. రాత్రివేళ ఒడిశా నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సును ఆపి ప్రయాణికులను కిందికి దింపారు. తరువాత  మావోయిస్టులు దానికి నిప్పుపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు దండకారణ్యం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కరపత్రాలను సైతం వదిలి వెళ్లారు.
భయాందోళనకు గురైన ప్రయాణికులు సర్వేల గ్రామంలో తలదాచుకొని సోమవారం తెల్లవారుజామున  చింతూరుకు చేరుకున్నారు.|కాగా.. ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతోపాటు దండకారణ్యంలో కూంబింగ్ కూడా ప్రారంభించారు.

Related Posts